సేఫ్టీ వాడమని చెప్తున్న సన్నీ…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో భయపెడుతుందో అందరికి తెలిసిందే. చైనాలో ఒక నగరంలో బయటకు వచ్చిన ఈ కరోనా వైరస్ ధాటికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయపడిపోతున్నారు. రోడ్ల మీదకు రావాలి అంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనితో అన్ని దేశాలు కూడా చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు.

మన దేశంలో కూడా దీని ప్రభావం కనపడుతుంది. కేరళ కి చెందిన ఒక విద్యార్ధికి కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్య శాఖ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ప్రజల్లో అవగాహన కోసం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. సిని, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా దీనిపై ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాలివుడ్ నటి సన్నీ లియోన్ కూడా సోషల్ మీడియాలో జాగ్రత్తలు చెప్పింది.

కరోనా రాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని… ప్రమాదం ఏ వైపు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. కరోనా వైరస్ రాకుండా ఉండాలి అంటే… మాస్క్ పెట్టుకోవాలని ముంబై లో తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి మాస్క్ లు పెట్టుకుని ట్విట్టర్ లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది సన్నీ. సేఫ్ గా ఉండల౦టే ఇలా చెయ్యాలని సూచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news