మోడీ తో కలసి మహోత్తర కార్యక్రమానికి పిలుపునిస్తున్న సూపర్ స్టార్..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. ఆయన నటనా చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ అందాన్ని కూడా పెంచుకుంటూ తనదైన శైలిలో చూపరులను ఆకట్టుకుంటున్న మహేష్ బాబుకు ఫిదా అవని సెలబ్రిటీ లేదని చెప్పడంలో సందేహం లేదు. ఇలా ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు కూడా అని చెప్పాలి.. మహేష్ బాబు పై అభిమానులకు ఎంత అభిమానం ఉంది అంటే ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోతున్న సినిమాలేవి లేకపోవడంతో పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి .. రీ రిలీజ్ లో కూడా కోట్ల రూపాయల వసూలు చేసి రికార్డు సృష్టించారు. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబుపై ఆయన అభిమానులకు ఎంత మంచి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే మహేష్ బాబు ఒకవైపు బిజినెస్ మొదలుపెట్టి మరొకవైపు స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా నడుపుతున్నాడు. అంతేకాదు సమాజానికి ఉపయోగపడే అంశాలలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు మహేష్ బాబు. ఇక ఈ క్రమంలోని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన రక్తదాన్ అమృత్ మహోత్సవానికి భారతీయ పౌరులందరూ భాగస్వామ్యులు కావాలి అని నరేంద్ర మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే . ఇక ఇదే విషయానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మద్దతు పలికారు.

ఆయన కూడా తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా రక్తదానం అమృత మహోత్సవ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. “ఒకరి ప్రాణాధారం కావడానికి ముందుకు వెళ్లి రక్తదానం చేయండి! ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.. మహేష్ బాబు అభిమానులు కూడా ఈ ట్వీట్ ను మరింత వైరల్ గా చేస్తున్నారు . ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news