జ‌వాన్ సాయితేజ కుటుంబాన్ని ఆదుకోవాలి : వీహెచ్

-

త‌మిళ‌నాడు లో జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం లో మ‌ర‌ణించిన జ‌వాన్ సాయితేజ కుటుంబాన్ని ఆదు కోవాల‌ని తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకుడు వీ హ‌న్మంత‌రావు డిమాండ్ చేశారు. సాయితేజ కుటుంబాని వి. హెచ్ ప‌రామ‌ర్శించారు. సీడీఎస్ బిపిన్ రావత్ వంటి గొప్ప వ్య‌క్తుల వ‌ద్ద సాయితేజ‌ ప‌ని చేయ‌డం తెలుగు వారికి గ‌ర్వ కార‌ణ‌మ‌ని అన్నారు. జ‌వాన్ సాయితేజ కుటుంబం లో అస‌లైన‌ దేశ భ‌క్తి ఉంద‌ని అన్నారు. సాయితేజ మ‌ర‌ణం త‌న‌ను బాధించిందని అన్నారు.

సాయితేజ కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని అన్నారు. ప‌రిహారం గా రూ. కోటి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అలాగే సాయి తేజ భార్య కు క‌నీసం గెజిటెడ్ స్థాయి లో ఉద్యోగం ఇవ్వాల‌ని అన్నారు. కాగ నేడు జ‌వాన్ సాయితేజ అంత్య క్రియ‌లు జ‌ర‌గ నున్నాయి. మృత దేహాలు గుర్తు ప‌ట్ట కుండ ఉండ‌టం తో సాయితేజ కుటుంబ డీఎన్ఏ తో మృత దేహాన్ని గుర్తించనున్నారు. త‌ర్వాత సాయితేజ స్వ‌గ్రామానికి తీసుకు వ‌చ్చి.. సైనిక లాంఛ‌నాల‌తో అంత్య క్రియ‌లు జ‌ర‌ప నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news