మంత్రి కొప్పులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

-

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మంత్రి కొప్పుల వేసిన పిటిషన్​ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల అవకతవకలపై హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పిటిషన్‌ వేశారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని లక్ష్మణ్​కుమార్​ అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పిటిషన్ కొట్టివేయాలని మంత్రి కొప్పుల హైకోర్టు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై మంత్రి కొప్పుల అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం మంత్రి పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news