శివసేన పార్టీ వివాదం.. ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

-

శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని వర్గానికి  కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఉద్ధవ్ ఠాక్రే పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు  నిరాకరించింది.  ఈసీ నిర్ణయానికి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని ఉద్ధవ్‌ ఠాక్రే తరపున వాదనలు వినిపించిన కపిల్‌ సిబల్‌ ధర్మసనాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.

ఈ దశలో ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఠాక్రే వర్గానికి చెందిన చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు ఎలాంటి విప్ జారీ చేయబోమని, ఏ చర్యలు ప్రారంభించబోమని శిందే వర్గం తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. అనంతరం విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news