అటార్నీ జనరల్‌ పదవిని తిరస్కరించిన ముకుల్‌ రోహత్గీ

-

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక పదవిని వద్దనుకున్నారు. అటార్నీ జనరల్‌ పదవిని తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన ఓ వార్తా సంస్థతో ధ్రువీకరించారు.

తన నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదని ముకుల్ రోహత్గీ అన్నారు. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అనంతరం కొనసాగడానికి వేణుగోపాల్‌ ఇప్పటికే తిరస్కరించారు. ఆ పదవిని చేపట్టాలని రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా.. అందుకు రోహత్గీ అంగీకరించలేదు.

రోహత్గీ ఇదివరకు 2014 జూన్‌ 19 నుంచి 2017 జూన్‌ 18 వరకు అటార్నీ జనరల్‌గా కొనసాగారు. అప్పుడు రెండోసారి కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నించగా తిరస్కరించారు. దాంతో 86 ఏళ్ల వయస్సులో కేకే వేణుగోపాల్‌ను మూడేళ్ల కాలానికి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పగించింది. తర్వాత ఆయన్నే కొనసాగించింది.

Read more RELATED
Recommended to you

Latest news