బ్రేకింగ్ : ప్రాణాలతోనే ఉన్న బిపిన్ రావత్.. ఆస్పత్రిలో చికిత్స

-

తమిళనాడు రాష్ట్రంలోని కునూరు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో.. cds జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలతో బతికి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం తర్వాత ప్రాణాలతో వున్న బిపిన్ రావత్ ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అయితే ఆయన ఒళ్లంతా పూర్తిగా కాలిపోయి ఉంది. దీంతో హుటాహుటిన బిపిన్ రావత్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బిపిన్ రావత్ కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ముగ్గురు ప్రత్యేక డాక్టర్లు బిపిన్ రావత్ కు వైద్యం అందిస్తున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. రేపే ఈ హెలికాప్టర్ ప్రమాదం, అలాగే బిపిన్ రావత్ హెల్త్ బులిటెన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. కాగా హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు… 14 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఇందులో 13 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ప్రాణాలతో ఉన్న 14 వ్యక్తి బిపిన్ రావత్ అని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news