ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ ఆకస్మిక మృతిని తట్టుకోలేక అతడి వదిన బీహార్లోని పూర్ణియాలో సోమవారం కన్నుముశారు. సుశాంత్ మరణించినప్పటి నుంచి ఆమె ఆహారం తీసుకోవడం మానేసినట్లు సమాచారం. దీంతో సోమవారం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె బీహార్లో తుది శ్వాస విడిచారు. అసలే సుశాంత్ సింగ్ మరణంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ కుటుంబంలో అతడి వదిన మరణం మరింత విషాదాన్ని నింపింది. కాగా సుశాంత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని.. ఒత్తిడికి అతడు మందులు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సుశాంత్ ది ముమ్మాటికి హత్యే అయివుంటుందని ఆయన మామ ఆరోపించారు. దీంతో పోలీసులు అన్నీ కోణాల్లో ఈ కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ ఇంట మరో విషాదం..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్...
Ganesh -