భార్యపై అనుమానంతో ప్రైవేట్ పార్ట్ లో కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

-

కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.అనుమానంతో భార్యను హతమార్చాడు ఓ భర్త. వివరాల్లోకి వెళితే.. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్న సరిత యాదవ్ అనే మహిళను ఆమె భర్త సంతోష్ తన ఇంట్లో ప్రైవేట్ పార్ట్ లో కత్తితో పొడిచి హత్య చేశాడు.సంతోష్ తన బార్య పై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అడ్డువచ్చిన మృతురాలు బంధువు పై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు.

గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రి కీ తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేపడుతున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించరు.ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు సంతోష్.బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు కులుసుంపుర పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news