ఏస్ వి రంగారావు మెచ్చిన ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ..!!

-

టాలీవుడ్ మరో మహానటుడిని కోల్పోయింది తెలుగు ఇండస్ట్రీ. లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లోనే ఎక్కువ రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన అనారోగ్యం తో కన్ను మూయడం తో టాలివుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది.

కైకాల 87 ఏళ్ల  వయస్సులో కన్ను మూశారు. పెద్ద రామారావు నుండి జూ ఎన్టీఆర్ వరకు అందరితో కలసి నటించి రికార్డ్ నెలకొల్పారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 770 ల్లో నటించారు. అన్ని రకాల పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి  హీరోగా,విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా , ఇలా అన్ని రకరకాల పాత్రల్లో మెరిశారు. ఒకప్పుడు ఏస్ వి రంగారావు  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని విధంగా నటించే వారు. అలాంటి ఏస్విఆర్ ఎంత పెద్ద నటుడు అయినా కూడా పోగడరు.కాని ఏస్విఆర్ పొగిడిన ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ.

ఇక ఏస్ వి రంగారావు రంగారావు గారి తర్వాత యముడు పాత్ర ఎవ్వరూ వేయలేరని తీర్మానించి నప్పుడు ఆయనే స్వయంగా మేకప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఇలా యముడి పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు అన్నీ కలసి ఉన్నాయి.యమగోల సక్సెస్‌ తరువాత యముడి పాత్ర అంటే సత్యనారాయణ మాత్రమే గుర్తొచ్చేలా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news