ఆడపిల్ల ఇంట్లోకి దూరిన స్వామీజీకి.. కరాటే దెబ్బలు..!

-

రష్యా నుంచి వచ్చిన ఓ మహిళ కొన్ని నెలలుగా తమిళనాడులో ఉంటోంది. విదేశాల నుంచి వచ్చింది.. సున్నితంగా ఉంటుందనున్నాడో ఏమో.. కత్తితో ఇంట్లోకి దూరాడు ఓ దుండగుడు. కానీ.. ఆమె కరాటే దెబ్బలకు చతికిలపడ్డాడు.రష్యాకు చెందిన ఆయిషా భారత్ కు వచ్చి గత జనవరి నుంచి తిరువన్నమళైలోని ఓ ఇంట్లో నివాసముంటోంది. కోయంబత్తూర్ కు చెందిన మణికందన్.. స్వామీజీ అవతారంలో అకస్మాత్తుగా ఆయిషా ఇంట్లోకి చొరబడ్డాడు.

swamiji
swamiji

కత్తి చూపించి ఆయిషాను బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ, కరాటేలో రాటుదేలిన ఆయిషా తన విద్యను ప్రదర్శించింది. మణికందన్ ను చితకబాది తనను తాను రక్షించుకుంది.అరుపులు విన్న ఇరుగుపొరుగువారు.. మణికందన్ ను బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషర్ మణికందన్‌ను అరెస్ట్ చేశారు. అసలు కత్తితో ఆయిషా ఇంట్లోకి ఎందుకు వెళ్లాడన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘటన చూసిన తరువాత ఒంటరి మహిళలు దగ్గరకి వెళ్లి అఘాయిత్యం పాల్పడేవారు కచ్చితంగా భయపడతారు.ఈ దుండగుడు కూడా ఒంటరి మహిళ అని తక్కువ అంచనా వేసి తన్నులు తిన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news