రేపు ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా

-

T20 వరల్డ్ కప్ విజేత టీమ్ఇండియా జట్టు బర్బడోస్ నుంచి ఇవాళ స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16 గంటల జర్నీ తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు టీమ్ఇం డియా ప్లేయర్లు దిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల కలను నెరవేర్చిన భారత ప్లేయర్లకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు దిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు టీమిండియా భారత్కు తిరిగొస్తున్న నేపథ్యంలో ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ వరల్డ్కప్ ట్రోఫీ ఉన్న వీడియోను బీసీసీఐ తాజాగా ఎక్స్లో షేర్ చేసింది. వరల్డ్ కప్ విన్నర్స్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు దిల్లీకి చేరుకున్నాక టీమ్ఇం డియా ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలవనున్నట్లు సమాచారం. కాగా, జూన్ 29న బర్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో నెగ్గిన టీమ్ఇండియా టోర్నీ ఛాంపియన్గా నిలిచి, దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news