సికింద్రాబాద్ డెక్కన్ మాల్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని

-

సికింద్రాబాద్ డెక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేసిన స్థలాన్ని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. భవనం కూల్చివేత వల్ల ఏమైనా నష్టం సంభవించిందా అని ఆరా తీశారు. మంత్రి అక్కడికి వచ్చారని తెలుసుకున్న స్థానికులు ఆ ప్రాంతానికి తరలివెళ్లారు.

అగ్నిప్రమాదం వల్ల పొరుగు భవనాలు దెబ్బతిన్నాయని మంత్రికి విన్నవించారు. దెబ్బతిన్న నివాసాలకు మరమ్మతులు చేయించాలని తలసానికి విజ్ఞప్తి చేశారు. స్థానికుల గోడు విన్న తలసాని..
దెబ్బతిన్న ఇళ్లకు నెలరోజుల్లో మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్​ నగరంలో నివాస ప్రాంతాల్లోని గోదాములు గుర్తించి తొలగిస్తామని చెప్పారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news