చాకలి ఐలమ్మ విగ్రహానికి గవర్నర్ తమిళిసై నివాళి

-

తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. హైదరాబాద్ లోయర్‌ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని.. పీడిత వర్గ ప్రజల కోసం ఎనలేని పోరాటం చేశారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేశారు. ఆమె త్యాగం ఎంతో గొప్పదని కొనియాడారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అన్నారు.

“చాకలి ఐలమ్మ తెలంగాణ వీర వనిత. ఆమె పోరాటం నేటి తరం మహిళలకు స్ఫూర్తి. ఐలమ్మ పోరాటాలను ప్రతి మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలి. పీడిత వర్గాల కోసం ఆమె ఎనలేని పోరాటం చేశారు. ఆమె త్యాగం ఎంతో గొప్పది.” అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news