కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పెద్ద పీట వేస్తున్నారు… నిరుద్యోగులను మోసగిస్తున్నారు.- తరుణ్ చుగ్.

-

కేసీఆర్ ఉద్యమంతో పాల్గొన్న యువతను పట్టించుకోవడం లేదని.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ ఫైరయ్యారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ సాబ్ ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణకు సేవ చేయడానికి, రక్షించేందుకే బీజేపీ పార్టీ ఉందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందే అని.. బంగారు తెలంగాణను నెరవేర్చనంత వరకు బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణలో యువత పోరాటాలే చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం వారిపై దాడికి పాల్పడుతోందని.. వారిని జైలు పాలు చేస్తుందని విమర్శించారు.

దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉందని… పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి మేకిన్ ఇండియాలో భాగంగానే హైదరాబాద్ కు కంపెనీలు వస్తున్నాయన్నారు తరుణ్ చుగ్. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాన మంత్రి మోదీ పటిష్టం చేశారని అన్నారు. విదేశాల నుంచి పెద్దపెద్ద కంపెనీలు వస్తున్నాయంటే కారణం కేంద్రం తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలే అని ఆయన పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news