మహేష్ సినిమాతో ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మూడవసారి ముచ్చటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక త్వరలోనే సినిమా షూటింగ్ సెట్ పైకి వెళ్ళనుంది.. సాధారణంగా త్రివిక్రమ్ తీసే ఏ సినిమాలో అయినా సరే కనుమరుగైన హీరోలకు, హీరోయిన్లకు అవకాశం ఇస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబుతో తీయబోయే సినిమాలో తెరమరుగైన తరుణ్ ను మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఇప్పటికే ఎస్ ఎస్ ఎం బి 28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయం అధికారికంగా కూడా ప్రకటించారు. పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం లవర్ బాయ్ తరుణ్ ను కలిసారు అని, పాత్ర నచ్చడంతో ఆయన కూడా అంగీకరించాడని వార్త బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో మరింత పాపులర్ అవుతున్న ఈ వార్తపై తరుణ్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని తెలిపిన తరుణ్.. మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ జరగబోతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు అని వెల్లడించారు.Tarun Has Binami Partnerships in Pubs?

ఇక తన జీవితంలో ఏం జరిగినా తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటానని.. ఎవరూ కూడా తనకు సంబంధించిన వార్తలు స్ప్రెడ్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా తెలిపాడు తరుణ్. ఏ విషయమైనా తానే స్వయంగా చెప్పే వరకు ఏ వార్తను స్ప్రెడ్ చేయవద్దు అని కూడా స్పష్టం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news