బ్రేకింగ్ : రేపు ఏపీ బంద్ కు టీడీపి పిలుపు

-

రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరియు టిడిపి లీడర్ పట్టాభి ఇంటి పై దాడి జరిగిన ఘటన కు నిరసనగా… రేపు ఆంధ్ర ప్రదేశ్ బంద్ కు పిలుపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రేపటి బంద్ లో తెలుగు దేశం పార్టీ మరియు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది పార్టీ. శాంతియుతంగా నిరసనలు తెలపాలని స్పష్టం చేసింది.

ఇక అటు ఇవాళ జరిగిన ఘటనల పై ఏపీ డీజీపీ కూడా స్పందించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయనం పాటించాలని పిలుపు ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామన్నారు. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలని పేర్కొన్నారు ఏపీ డీజీపీ సవాంగ్.

Read more RELATED
Recommended to you

Latest news