పోలీసుల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు టిడిపి నేతలు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. యాత్రను అడ్డుకోవడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టిడిపి నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రచార రథాలు సీజ్ చేయడమే కాకుండా మైకులు కూడా లాక్కుంటున్నారని గవర్నర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు లోకేష్ కు ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతుందని ఫిర్యాదులో తెలిపారు. ఏ పాదయాత్రకు లేని అడ్డంకులు లోకేష్ పాదయాత్రకే వర్తిస్తాయా? అని టిడిపి నేతలు ప్రశ్నించారు. ప్రజల వద్దకు వెళ్లే హక్కు ప్రతిపక్ష నాయకులకు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు పై తప్పక న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news