ఏపీ సర్కారు పై గవర్నర్ కు టిడిపి ఫిర్యాదు

-

అమరావతి : ఏపీ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు.జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చిందని…రాత్రి పూట ఏపీ సర్కార్ రహస్య జీవోలు విడుదల చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా? లేదా ? అనేది ఒక వారం రోజులు చూసి తర్వాత కోర్టుకి వెళ్తామన్నారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని… బ్లాంక్ జీవోలపై గవర్నర్ కి పిర్యాదు చేయగానే ఆన్లైన్లో జీవోలు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ప్రభుత్వం భయపడుతుందని… జీవోల అంశంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. జీవోలు సామాన్యులు మళ్లీ చూసే విధంగా ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news