ఆమరణ దీక్షకు దిగిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

-

విశాఖలో  ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమం ఉధృతం అవుతోంది. ఇప్పటికే టీడీపీ రిలే నిరాహార దీక్షలు చేస్తుండగా ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రిలే నిరాహారదీక్షలు వైసీపీ ప్రారంభీంచింది. ఈరోజు జీవీఎంసీ ధర్నాచౌక్ దగ్గర సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దీక్షకు దిగారు. మద్దతుగా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి కూడా దీక్షలో కూర్చున్నారు.

అయితే ఈ సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది. అయితే మరోపక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆమరణ దీక్షకు దిగారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీపార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పల్లాశ్రీనివాస్ గాజువాకలో దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును రక్షించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news