కరీంనగర్‌లో TDP ఆవిర్భావదినోత్సవ సభ?

-

తెలుగుదేశం పార్టీ తన పూర్వవైభవాన్ని పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో పునర్వైభవం కోసం పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న కరీంనగర్‌లో భారీ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా నాయకులు కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంతో పాటు అంబేడ్కర్‌ మైదానాన్ని పరిశీలించారు. మొదట సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఆవిర్భావదిన వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ భావించి దీనికి రాష్ట్రవ్యాప్తంగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది.

కానీ కంటోన్మెంట్‌ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో కరీంనగర్‌లో సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడి మైదానాలను పరిశీలించారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారని నాయకులు చెబుతున్నారు. సభ ఎక్కడ నిర్వహిస్తారనే విషయంలో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే వీలుంది.

Read more RELATED
Recommended to you

Latest news