ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి సిద్ధం: బుద్దా వెంకన్న

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మంగళవారం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ జోన్ – 1 సమావేశానికి బుద్దా వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాలను టిడిపి కైవసం చేసుకుంటుందన్నారు. జగన్ పతనానికి ఉత్తరాంధ్ర నుంచే నాంది పలికామన్నారు బుద్దా వెంకన్న.

జోన్ 1 కి సంబంధించి 35 నియోజకవర్గాల ఇన్చార్జిలు, నియోజకవర్గ అబ్జర్వర్లు ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. ఆగస్టు 30 లోపు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసిపి నాయకులకు ధన దాహం ఉందని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మద్యం నిషేధం పేరుతో డబ్బు అంతా తాడేపల్లి కి వెళ్తుందని ఆరోపించారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news