బీజేపీలో చేరనున్న టీడీపీ.. పుకార్లపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

-

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంతో తమ సంబంధాలు ఉంటాయని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఎన్డీఏలో చేరబోతున్నారా అనే ప్రశ్నకు.. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఉంటుందని బదులిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2018లో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏలో తెలుగుదేశం చేరుతుందంటూ సాగుతున్న ప్రచారంపై సూటిగా స్పందించని చంద్రబాబు.. అలా ప్రచారం చేస్తున్న వాళ్లనే సమాధానం అడగాలని చెప్పారు.

ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 27 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విజన్ ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి తప్ప, విద్వేషంతో కాదన్నారు. రాజకీయం వేరు అభివృద్ధి వేరు అనే విషయాన్ని తాను అచరిస్తే.. జగన్‌రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్నారని ఆక్షేపించారు. జగన్‌రెడ్డి విధ్వంసం చేసిన అమరావతిని పునర్ నిర్మించాల్సి ఉందన్నారు. విజన్ ఉంటే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని.. హైదరాబాద్‌ విషయంలో చేసి చూపించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news