జగన్ కంటే హిట్లర్, గడాఫీలే బెస్ట్

-

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రశ్నించే వారిపై దాడులు దుర్మార్గం అని ఆయన ఆరోపించారు. పట్టాభిరాం కారుపై దాడి వైసీపీ నేతల పనే అని ఆయన అన్నారు. జగన్ పాలన.. హిట్లర్, గడాఫీల కంటే దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అవినీతి పాలన మించిపోయిందని మండిపడ్డారు.

రోజుకో దాడి, పూటకో విధ్వంసంతో రాష్ట్రం రావణ కాస్టమైందని అన్నారు. అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.? అని నిలదీశారు. వైసీపీ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారనే కక్షతోనే పట్టాభిరాం కారుపై దాడి చేసారని అన్నారు. జగన్ పాలనలో విధ్వంసం, కక్షలు, కార్పన్యాలు రాష్ట్రవ్యాప్తమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. తప్పుడు కేసులతో టీడీపీ నాయకులను వేధిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలపై డీజీపీ ఎందుకు స్పందించరు.? అని నిలదీశారు. డీజీపీ ఉన్నది రాష్ట్ర ప్రజల కోసమా.. జగన్మోహన్ రెడ్డి కోసమా.? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news