అర్ధరాత్రి వరకు వల్లభనేని వంశీతో.. టీడీపీ నేతల చర్చలు

-

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆ నియోజకవర్గంతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌‌ను బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దించిన కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు రంగంలోకి దిగారు. నిన్న రాత్రి దాదాపు మూడున్నర గంటలపాటు కేశినేని నివాసంలో వల్లభనేనితో చర్చించారు. అర్ధరాత్రి వరకు ఈ చర్చలు కొనసాగాయి.

అయితే వంశీ మాత్రం.. తాను ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారికి స్పష్టం చేశార‌ట‌. ఆయన మాటలకు టీడీపీ నేతలు బదులిస్తూ.. టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీలో ఉన్న ఇబ్బందుల విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి భరోసా విన్న వల్లభనేని మాట్లాడుతూ.. తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news