కరోనా సమయంలో చంద్రబాబుకి ఎమ్మెల్యే షాక్…!

-

ఒక పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీడీపీ అధినేత మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అనవసరంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అనవసరంగా ఆయన కొన్ని విమర్శలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వానికి సహకారం అందించాల్సి ఉంది.

కాని చంద్రబాబు మాత్రం దాదాపుగా అలా చేయడం లేదు. దీనితో టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అసహనానికి గురవుతున్నారు. అనవసరంగా చంద్రబాబు చర్యలతో తమకు ప్రజల్లో విలువ పోతుంది అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో విశాఖకు చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయనే వెలగపూడి రామకృష్ణ. పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

ఆయన మొన్నటి వరకు జగన్ పై చాలా విమర్శలు చేసారు. ఇప్పుడు జగన్ కరోనాపై పోరాడటం, విశాఖ మెడ్ టెక్ జోన్ నుంచి కిట్స్ తయారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో… ఆయనపై ఇప్పుడు సానుకూలంగా ఉన్నారు ఎమ్మెల్యే. అందుకే త్వరలోనే ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news