జగన్ ఫై టీడీపీ ఎంపీ `సిత్తరాల సిరపడు` సెటైర్లు.. డోంట్ మిస్..!

-

సాక్షి దిన పత్రికను టీడీపీ నేత వర్ల రామయ్య ఈ రోజు మీడియా సమావేశంలో తగ‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ పత్రికలో రాస్తోన్న వార్తల పట్ల తనకు విరక్తి కలిగిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు సాక్షి పత్రిక ఫై జగన్ ఫై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల విడుద‌లైన అల వైకుంఠపురములో చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు పాటతో రౌడీమూక ని అల్లు అర్జున్ మట్టి కరిపించి సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

అయితే ఈ సాంగ్‌ను బేస్ చేసుకుని ఎంపీ రామ్ మోహన్ నాయుడు చంద్రబాబు వెర్షన్ లో వ్యాఖ్యలు చేస్తూ, సాక్షి, జగన్ ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. “జగనోరి సాక్షి అబద్దాలు అచ్చోసి కుమ్మబోతే, ఒడుపుగా ఒడిసిపట్టి దాని కొమ్ములిసిరిసి, దమ్ముంటే రమ్మనంటూ రొమ్ము విరిచి పిలిచినోడు…మా చంద్రబాబు” అని వ్యాఖ్యానించారు. “అక్రమాల వారసుడు జగన్మోహనుడు తెలుగుదేశం ఏంట పడితే గుద్ది గుండ సేసినాడు మా చంద్రబాబు” అని అన్నారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news