గుడ్ న్యూస్ : విశాఖ స్టేడియంలో టీమిండియా-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌

-

టీమిండియా క్రికెట్ జట్టు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఎక్కడ తగ్గేది లేదంటూ ప్రతి సిరీస్ను గెలుస్తూ వస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా విజయాల బాట పట్టింది అని చెప్పాలి. అయితే ఇటీవలే శ్రీలంక పై టెస్ట్ సిరీస్…ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇక ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ పై ఫోకస్ చేశారు.

మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. దాదాపు మూడు నెలల పాటు ఐపీఎల్ లోనే టీమిండియా ఆటగాళ్లు ఉంటారు. ఇక ఐపీఎల్ టోర్నీ పూర్తికాగానే జూన్ 9 నుంచి సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టి 20 మొదటి మ్యాచ్ జూన్ 9న తేదీన జరుగనుంది.

మొత్తం ఐదు టి20 లు సౌత్ ఆఫ్రికా జట్టుతో ఆడనున్న టీమ్ ఇండియా. అయితే ఇందులో లో జూన్ 12వ తేదీన రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ విశాఖలోని ఇంటర్నేషనల్ స్టేడియం లో నిర్వహించాలని… బిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ వాసులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news