కేసీఆర్ కొడుకుపై తీన్మార్ మల్లన్న మరో సంచలన పోల్

-

ప్రముఖ జర్నలిస్టు, బీజేపీ పార్టీ నేత తీన్మార్‌ మల్లన్న… టీఆర్‌ఎస్‌ పార్టీపై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా క్యూ న్యూస్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా.. పొద్దున్నే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ను తిట్టడం మొదలెడతారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను.. ప్రజలకు ఎత్తి చూపిస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే.. తాజాగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కుమార్‌.. తన సోషల్‌ మీడియాలో మరో పోల్ నిర్వహించారు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

నిన్న మంత్రి కేటీఆర్‌.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కేంద్రం.. తెలంగాణ ఎలాంటి సహాయం చేయడం లేదని.. వరుసగా ట్వీట్లు చేశారు. దేశంలో బీజేపీ దండగా… తెలంగాణకు మేము అండగా ఉన్నామంటూ.. కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయితే.. కేటీఆర్‌ కు కౌంటర్‌ గా బీజేపీ పార్టీ నేత తీన్మార్‌ మల్లన్న పోల్‌ నిర్వహించారు. “రాష్ట్రానికి మేము అండగా ఉన్నాం : కేసీఆర్ కొడుకు” అంటూ ప్రశ్న పై పోల్‌ నిర్వహించారు మల్లన్న.

అయితే.. ఈ ప్రశ్నపై నెటిజన్లు.. కేటీఆర్‌ కు వ్యతిరేకంగానే స్పందించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా.. గత నెలలో.. కూడా కేటీఆర్‌ కొడుకు హిమాన్షుపై మల్లన్న పోల్‌ నిర్వహించారు. దీంతో ఈ పోల్‌ వివాదం మారింది. ఆ తర్వాత.. తీన్మార్‌ మల్లన్నపై టీఆర్ఎస్‌ పార్టీ అభిమానులు దాడి కూడా చేశారు. ఇక తాజాగా మల్లన్న మరో పోల్‌ పెట్టడంతో.. ఏం జరుగుతుందోనని అందరూ అనుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news