10 లక్షల మందితో సభ పెడతా : తీన్మార్ మల్లన్న

-

ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనంటూ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పార్టీ మారుతారా..లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. 7200 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన తీన్మార్ మల్లన్న.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ముఠా సభ్యుల సంఖ్య 7200 అని తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ నాయకుడు ఎంత భూమిని కబ్జా చేశారో తన దగ్గర చిట్టా ఉందని, త్వరలో ప్రజల్లోకి వెళ్లి అన్ని వివరిస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు.

Teenmaar Mallanna arrested

తన కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసి ఇస్తానన్నారు. క్యూన్యూస్ ఛానల్‌ ద్వారా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాని వెల్లడించారు. క్యూన్యూస్ ఛానల్‌ను మూయించేందుకు కొందరు ప్రయత్నించారని,. 7200 పేరుతో త్వరలో 10 లక్షల మందితో భారీ సభ ఏర్పాటు చేస్తామని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు పోతామని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్న మల్లన్న.. 7200లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రజలకు సత్వర న్యాయం ప్రధానంగా ఉన్నాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news