స్వచ్ఛత కోసం కృషి చేస్తున్న తేజస్వి

-

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన తేజస్వి తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె .చిన్నతనం నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టం. సమాజానికి తన వంతు ఏదో చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తన గురించి మరింత తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఒంగోలు అని ,నగరంలో ఏమాత్రం పరిశుభ్రత కనిపించిందని ఓ పత్రిక వార్త రాసింది. ఈ వార్తను చదివిన తేజస్వి  చాలా బాధపడింది. అసలు ఒంగోలు గురించి అలా రాయడానికి కారణాలు ఏంటని శోధిస్తే పట్టణంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉందని తెలిసింది.
పట్టణంలో అపరిశుభ్రతను తొలగించేందుకు తన వంతు ఏమైనా చేయగలనా ఆలోచించింది.ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి పుట్టిన ఊరును శుభ్రం చేయడానికి నడుం బిగించింది.ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిపితే ఆమె తండ్రి పూర్తి గా మద్దతు  పలికినా , బంధువుల నుంచి ఎదురైన అవమానాలు వెక్కిరింపులను పట్టించుకోలేదు . తండ్రి ప్రోత్సాహంతో 2015లో తన స్నేహితులతో కలిసి ఒంగోలు లోనే “భూమి ఫౌండేషన్” ను ఏర్పాటు చేయడం జరిగింది.
తను ఈ ఫౌండేషన్ ను స్థాపించాడానికి ముఖ్య కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా యువతకు ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు.స్వచ్ఛ పట్టణంగా ఒంగోలు ను మార్చడమే ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం.తన లాంటి యువతను బృందంగా చేసుకుని వారికి రథసారథి గా మారి స్వచ్ఛత వైపు అడుగులు వేసింది.ఇందుకోసం మొదట ఒంగోలు కలెక్టరేట్ భవనం చుట్టుపక్కల పరిసరాలను సుందరంగా తీర్చిద్ధిదారు.కలెక్టరేట్ సుందరీకరణ లో  మొదలైన ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు పట్టణంలోని అన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరించాయి.
పట్టణంలో వీరు శుభ్రం చేసిన ప్రాంతాల్లో రంగులు వేసి “వన్ గోల్ క్లిన్ ఒంగోల్”  అంటూ వివిధ స్ఫూర్తివంతమైన నినాదాలు రాసేవాళ్ళు ఈ బృంద సభ్యులు. భూమి ఫౌండేషన్ చేపట్టిన స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగమయ్యేందుకు పట్టణంలోని యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో భాగమయ్యారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ Tech Mahindra సాఫ్ట్వేర్ కంపెనీ లో చేరిన తేజేస్వి వృత్తి జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి వారంతాల్లో సుమారు హైదరాబాద్ నుంచి 320 కిలో మీటర్లు ప్రయాణించి  ఒంగోలు వచ్చి భూమి ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కేవలం ఒంగోలుకె పరిమితం కాకుండా గుంటూరు, హైదరాబాద్ లలో సైతం ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు విస్తరించింది.
 
స్వచ్చతకు ప్రాధాన్యం ఇస్తూనే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం భూమి విశేషంగా కృషి చేస్తుంది.కేరళ వరదల సమయంలో ఈ సభ్యులందరూ కలిసి విరాళాలు సేకరించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. కరోనా సమయంలో అయితే ఒంగోలు ప్రాంతంలో వీరు నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల్లో విశేష స్పందన లభించింది.
స్వచ్ఛత కోసం భూమి ఫౌండేషన్ చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న దేశ ప్రధాని మోడీ గారు తేజస్వి బృందాన్ని ప్రశంసించారు.హైదరాబాద్ నగరం సుందరికరణకు కృషి చేస్తున్న వీరిని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి యేటా హైదరాబాద్ లో జరిగే ” మన నగరం” కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు.ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాన్ని వరుసగా మూడు సార్లు అందుకున్నారు.
భూమి ఫౌండేషన్ ఇప్పటి వరకు విజయవంతంగా నడవడం లో ఏంతో మంది వలంటీర్ల శ్రమ ఉంది అని తేజస్వి చెబుతున్నారు. ఒకవైపు వృత్తి జీవితంలో రాణింస్తూనే మరో వైపు ప్రవృత్తి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడ విశేషంగా రాణింస్తున్న తేజేస్వి ఎంతో మందికి స్పూర్తినిస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news