Big Boss OTT: ‘బిగ్ బాస్’ నుంచి తేజస్వి మడివాడ ఎలిమేషన్.. కంటెస్టెంట్స్ ఎమోషనల్..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీలో అప్పుడే ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసింది. కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిన సమయం వచ్చేయగా, బిగ్ బాస్ ఒకరిని ఎలిమినేట్ చేసేశాడు. హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్స్ కు ఎలిమినేషన్ విషయం చెప్పేశాడు. అలా ఆ రౌండ్ లో చివరకు తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయింది.

తమ చేతుల్లోని ప్లాస్కులోని యాసిడ్ ను బౌల్ లో పోసినపుడు ఎవరి బౌల్ లో కలర్ అలానే యెల్లో కలర్ లో ఉంటే వారు సేఫ్ అని నాగార్జున చెప్పాడు. శ్రవంతి, తేజస్వి మడివాడ ఇద్దరూ తమ చేతిలోని యాసిడ్స్ ను బౌల్ లో పోసేశారు.

ఈ క్రమంలోనే నాగార్జున కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. ఫైవ్, ఫోర్, త్రీ, టూ వన్.. అని చెప్తున్న టైంలోనే వారు యాసిడ్ పోశారు. తేజు యాసిడ్ ఫిష్ బౌల్ లో పోయగానే అది రెడ్ కలర్ లోకి వచ్చేసింది. దాంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగార్జున.

తేజు ఎలిమేనట్ అయిందని తెలుసుకుని కంటెస్టెంట్స్ ఒక్కరిగా షాక్ అయ్యారు. ‘వాట్’ అని అనుకున్నారు. అంతలోనే నాగార్జున ఎలిమినేట్ అయిన వారి అక్కడి నుంచి వచ్చేయాలని సంకేతాలిచ్చారు. మిగతా కంటెస్టెంట్స్ తేజస్వి మడివాడను ఓదార్చారు.

శ్రవంతి, ఇతరులు ఆమెను హగ్ చేసుకున్నారు. అలా ఎలిమినేషన్ రౌండ్ పూర్తయింది. టీవీల్లో టెలికాస్ట్ అయినపుడు ‘బిగ్ బాస్’షోకు వ్యుయర్ షిప్ కొంచెం ఎక్కువగానే ఉండేది. కానీ, ఓటీటీ వర్షన్ అయిన నాటి నుంచి అంత విశేషమైన ఆదరణ కనబడటం లేదని కొందరు అయితే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news