ఈనెల 25 వరకు తెలంగాణ-కర్ణాటక సరిహద్దు మూసివేత

-

తెలంగాణ ప్రయాణికులకు అలెర్ట్. తెలంగాణ-కర్ణాటక సరిహద్దును ఈనెల 25 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా నది వంతెనకు మరమ్మతులు చేస్తున్న కారణంగా వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. రహదారికి బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు.

 

నిలిచిపోయిన వాహనాలను ఎన్​హెచ్​-167 మీదుగా రాయచూర్​ వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. హైదరాబాద్, మహబూబ్​నగర్ నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలను భూత్పూర్, ఎర్రవల్లి చౌరస్తా, గద్వాల, ధరూర్ మీదుగా రాయచూర్‌కు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. యాద్గిర్, నారాయణపేట నుంచి రాయచూర్‌ వెళ్లే వాహనాలను.. మరికల్, అమరచింత, జూరాల డ్యామ్‌, ధరూర్ మీదుగా రాయచూర్‌కు మళ్లిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news