గుడ్ న్యూస్ : మున్సిపాలిటీలకు రూ.1200 కోట్లు మంజూరు చేసిన కేసీఆర్

-

ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభం అయిన ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు అందరూ హాజరు అయ్యారు.  హైదరాబాద్ శివారులోని మున్సిపాల్టీలలో మంచి నీటి సమస్య పై తెలంగాణ క్యాబినెట్ చర్చిస్తోంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తక్షణమే హైదరాబాద్ శివారు లోని మున్సిపాలిటీలకు అదనంగా రూ.1200 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

అలాగే మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్ ద్వారా లేఅవుట్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక అటు పల్లె, పట్టణ పురోగతి లపై పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖల అధికారులు కేబినెట్ ముందు నివేదికలు సమర్పించారు. కాగా ఈ కెబీనెట్ సమావేశంలో 50 వేల ఉద్యోగాలపై  ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news