తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

-

తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు తగ్గు ముఖం పడుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 340 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,57,716 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 02 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3872 మంది కరోనా మహమ్మారి తో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 5,891 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,47,953 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 359 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.49 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 75,102 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,45,59,439 కు చేరుకుంది. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కేసులు… ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం శుభసూచకం.

Read more RELATED
Recommended to you

Latest news