ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు…

-

తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ లోకి అధికార పార్టీ నుండి ఇటీవల రాజీనామా చేసి బయటకు వచ్చేసిన కీలక నేతలు రానున్న క్రమంలో కీలక సమావేశం ఢిల్లీ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలకు ఆదేశాలను క్లియర్ గా ఇచ్చింది. ఖమ్మం మరియు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనాయకులను ఢిల్లీ రావాల్సిందిగా తెలియచేసింది. రేపే ఈ రెండు జిల్లా ముఖ్యనేతలు ఢిల్లీ కి బయలుదేరి వెళ్లనున్నారు. కాగా అధికార పార్టీ నుండి బయటకు వచ్చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులురెడ్డి లు కాంగ్రెస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

వీరిని తీసుకునే ముందు రాహుల్ గాంధీ వీరితో భేటీ అయ్యి రానున్న సమస్యలను చర్చించడానికి అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news