టికెట్ ల విషయంలో రేవంత్ – ఉత్తమ్ ల మధ్య వాగ్వాదం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలు అన్నీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కేవలం గెలుపు గుర్రాలకే టికెట్ లను కేటాయిస్తున్నారు. ఇక ఈ రోజు టికెట్ ల ఎంపిక లో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు మధ్యన చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇక రెండు టికెట్లను కేటాయిస్తున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన టికెట్ విషయంలో ఉత్తమ్ మరియు రేవంత్ రెడ్డి లకు గొడవ జరిగింది. ఈ విషయంలో ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలా వద్ద అన్న విషయం మనము నిర్ణయించడం కరెక్ట్ కాదు, అది ఆదిశరణానికి వదిలేద్దాము అని రేవంత్ అంటే… లేదు ఒక పీసీసీ చీఫ్ గా ముందుగానే హై కమాండ్ కు చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఇద్దరూ మాటలను మార్చుకున్నారు.

ఇక ఈ వేడి వాడి మాటలతో ఇద్దరూ అసంతృప్తిగానే సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news