Breaking : రేపు కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించనున్న సీఎం జగన్‌

-

రేపు కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మో‌‌హన్‌రెడ్డి పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగ్గంపేట మండలం ఇర్రిపాక చేరుకుంటారు.అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో ఆయన కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు.

CM Jagan to inaugurate APNGOs' meet in Vijayawada today

మధ్యాహ్నం 3:50 గంటలకు హెలికాప్టర్‌లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. స్థానిక నేతలతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు మంజీరా కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తర్వాత 4.25 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మాధవి లత, ఎస్పీ సతీష్ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news