తెలంగాణలో కొత్తగా 265 కరోనా కేసులు

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో కరోనా రక్కసి తగ్గుముఖం పడుతోంది. మొన్నటి భారీగా నమోదైన కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 17,521 శాంపిల్స్ పరీక్షించగా, 265 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 142 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు గుర్తించారు.

Hyderabad: Military braces to fight out Corona spread in Secunderabad

మరో 301 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,29,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,22,173 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,183 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news