తెలంగాణలో కొత్తగా 552 కరోనా కేసులు..

-

అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 500కి పైన నమోదవడం ఆందోళన కలిగించే విషయం. గడిచిన 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు నిర్వహించగా, 552 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 51, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, సంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,03,374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…. 7,94,510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,753 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version