తెలంగాణాలో తగ్గిన కేసులు.. ఈరోజు ఎన్నంటే ?

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక పక్క రాష్ట్రం ఏపీతో పోలిస్తే కేసుల నమోదు తక్కువే ఉన్నా తెలంగాణా వాసులను కరోనా భయం వీడ లేదు. అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో 1,873 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 9 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 827కు చేరింది.

ఇక ఇప్పటిదాకా కరోనా నుండి 92,837మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 1,849 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 31,299 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 24,216 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 37,791 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 13,65,582కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 360 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో కరీంనగర్ జిల్లా 180 కేసులతో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news