తెలంగాణలో ఇవాళ ఎన్ని కేసులో తెలిస్తే వామ్మో అనాల్సిందే..!

-

తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. తెలంగాణాలో నేడు 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9553కు చేరుకుంది. వీరిలో 4224 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 5109 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news