కరోనా బారిన పడ్డ పాక్ క్రికెట్ జట్టు..!

-

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇప్పటికే దీని బారిన పడి ఎంతో మంది మృతి చెందారు. తన, మన అనే బేధాలు దీనికి ఉండవు, కాబట్టి.. కల,మత, ప్రాంతాలకు అతీతంగా ఇది అందర్నీ బలి తీసుకుంటుంది. ఇప్పటికే దీని బారిన పడి ఎంతో మంది ప్రముఖులు చనిపోయారు. అయితే తాజాగా దీని ప్రభావం పాకిస్తాన్ క్రికెట్ జట్టు మీద పడింది.

 

ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారినపడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో జట్టు మొత్తానికి పరీక్షలు నిర్వహించగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం 10 మంది సభ్యులకు కరోనాగా తేలింది. కరోనా సంక్షోభం తర్వాత మరో వారం రోజుల్లో పాక్ జట్టు ఇంగ్లాండ్ బయలుదేరాల్సి ఉండగా, ఈ కరోనా ఫలితాలు జట్టుకు పెద్ద దెబ్బగా మిగలనుంది. అయితే ఇంగ్లాడ్-పాక్ సిరీస్ కోసం ఎంపికైన క్రికెటర్లకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా జట్టులో దాదాపు అందరికీ పాజిటివ్ గా నిర్దారణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news