తెలంగాణలో కొత్తగా 3,944 కరోనా కేసులు నమోదు

-

తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 3,944 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 7,51,099 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు.

దీంతో ఇప్పటి వరకు 4,081 మంది కరోనా మహమ్మారి తో మరణించారు.ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 39,520 గా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 7,07,498 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 2,444 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 94.20 శాతంగా ఉంది.

ఇండియా రికవరీ రేటు 97.50 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.54% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 97,549 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 3,17,76,018 కు చేరుకుంది.అటు జీహెచ్‌ ఎంసీ పరిధీలో ఇవాళ ఒక్క రోజే 1372 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news