తెలంగాణా ఎంసెట్ ఫలితాలు విడుదల.. మొదటి పది ర్యాంక్ లు అబ్బాయిలకే !

-

తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం గత నెల 9,10,11,14 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకి లక్షా 43 వేల 326 మంది దరఖాస్తు చేసుకుంటే లక్షా 19 వేల 184 మంది హాజరు అయ్యారు. అంటే సుమారు 83.19% విద్యార్థులు హాజరు అయ్యారు. అయితే ఈ హాజరు అయిన లక్షా 19 వేల 184 మందికి గాను 89 వేల వేల 834 మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు వివరాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇక తాజాగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను కూడా ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 9న ప్రారంభం కానుంది. నవంబర్‌ రెండో తేదీ వరకు రెండు విడతల్లో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. మిగతా సీట్లను కళాశాలలో భర్తీ చేసేందుకు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం నవంబర్‌ 4న మార్గదర్శకాలను ప్రవేశాల కమిటీ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news