DOSTH : ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

-

డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ ప్రవేశాల ”దోస్త్” మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28 వరకు పొడగిస్తూ… తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్‌.

ఈ పొడగింపు కారణంగా మొదటి విడత సీట్ల కేటాయింపు ఆగస్ట్ 4న ఉండనుంది. అలాగే… సీట్లు పొందిన వారు ఆగస్ట్ 9 వరకు ఆయా కాలేజీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 5 నుండి 18 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అలాగే.. రెండో విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 25 న ఉండనుంది. ఇక సీట్లు పొందిన వారు ఆగస్ట్ 31 లోపు కాలేజీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా… ఇప్పటి వరకు దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సంఖ్య
లక్షా 88 వేల 720కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news