బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చాలా అసంతృప్తిగా ఉన్నారు – తెలంగాణ గవర్నర్

-

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. ఇవాళ బాసర ట్రిపుల్‌ ఐటీని గవర్నర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్ క్యాంపస్, వాష్ రూమ్ లు కూడా చూసానని.. విద్యార్థులు, ప్యాకల్టి తో మాట్లాడానని వివరించారు. ట్రిపుల్ ఐటీ లో చాలా వరకు సమస్యలున్నాయని.. ల్యాప్ ట్యాప్ లు ఇవ్వలేదని ఆగ్రహించారు.

ప్రొటో కాల్ ఎక్కడ ఉందని.. క్యాంపస్ లో పోలిసులు భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు అని విద్యార్థులు చెప్పారని తెలిపారు. నేను ఇంచార్జీ విసి కి చెప్పానని.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తానని స్పష్టం చేశారు. చనిపోయిన సంజయ్ కిరణ్ విషయం నా దృష్టికి వచ్చిందని.. మెస్ ల విషయం లో విద్యార్థులు చాలాగా అసంతృప్తిగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రతిరోజు రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని మీడియా సమావేశంలో గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news