బ్రేకింగ్‌ : ఆర్టీసీ సమ్మెపై విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైకోర్టులో మరోసారి వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తరపున అడ్వకేట్‌ జనరల్‌ తన వాదనలు వినిపిస్తున్నారు. కార్మిక సంఘాలు విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబట్టాయని, కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదని, చర్చలు జరపకుండానే యూనియన్ నేతలు బయటకు వెళ్లిపోయారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్‌ తరపు న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు.

మ‌రోవైపు ప్రభుత్వం ఒక్క డిమాండ్ పైనే పట్టబట్టడం సరికాదని హైకోర్టు పేర్కొన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని, 21 డిమాండ్లపైనే చర్చిస్తామంటూ.. ఇతర డిమాండ్లను పట్టించుకోలేదని యూనియన్ తరపు న్యాయావాది దేశాయి ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. కార్పోరేషన్ పై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చలు సాగాలని హైకోర్టు పేర్కొంది. మొదట యూనియన్ పేర్కొన్న 21 డిమాండ్లపై చర్చలు సాగితే.. కార్మికుల్లో ఆత్మస్ఘైర్యం కలుగుతుందని హైకోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news