తెలంగాణ బీజేపీ కొత్త బాస్ గా కిషన్ రెడ్డి ?

-

కాసేపటి క్రితమే ఢిల్లీ వేదికగా కేంద్ర కాబినెట్ మీటింగ్ ప్రారంభం అయింది. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మిస్టర్ అమిత్ షా , జేపీనడ్డా మరియు రాజ్ నాధ్ సింగ్ లతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ దాదాపుగా రాత్రి 9 గంటల వరకు జరగనుంది. ఈ భేటీలో పలువురు మంత్రివర్గంలో చోటు కోల్పోవడం మరియు కొందరు కొత్త ముఖాలు చోటును దక్కించుకోనున్నాయి. దానితో ఈ భేటీ దేశవ్యాప్తంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రము సంగతి తీసుకుంటే ఇద్దరి నేతల స్థానాలను స్వాప్ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ కిషన్ రెడ్డి ని తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమించి, అదే విధంగా ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను కేంద్ర సహాయ మంత్రిగా చేయనున్నారట.

ప్రస్తుతానికి అయితే ఇదే సమాచారం వైరల్ గా ఉంది. మరి ఇందులో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అన్నది తెలియాలంటే మరో రెండున్నర గంటలు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news