ఎట్టకేలకు రేవంత్ కి భద్రత కల్పించిన తెలంగాణ పోలీస్…

-

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని తెలంగాణ పోలీశాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర బలగాలతో కాకుండా రాష్ట్ర పోలీసులతోనే 4+4 గన్ మెన్లను, ఎస్కార్ట్ లతో భద్రత కల్పించాలని నిర్ణయించి ఈ మేరకు సిబ్బందిని పోలీసు శాఖ రేవంత్ ఇంటికి పంపింది. గత కొద్ది రోజుల క్రితం తనకు ప్రాణ హాని ఉందంటూ.. రేవంత్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు కేంద్రం ద్వారా భద్రత కల్పించాలంటే వారి ఖర్చులను రేవంత్ రెడ్డి భరించాలని సూచించింది. ఈ ప్రక్రియ కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఫోర్స్ తో భద్రత కల్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గతంలో తనకు భద్రత కల్పించాలని ఎన్నిసార్లు పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ వారు స్పందించకపోవడంతో రేవంత్ కోర్టుని ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news